భారతరత్నతో అద్వానీకి సముచిత గుర్తింపు: దత్తాత్రేయ

భారతరత్నతో అద్వానీకి సముచిత గుర్తింపు: దత్తాత్రేయ

న్యూఢిల్లీ, వెలుగు: దేశ అత్యున్నత పురస్కారమైన భారత రత్నతో మాజీ డిప్యూటీ ప్రధాని ఎల్ కే అద్వానీకి సముచిత గుర్తింపు దక్కిందని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. అలాగే భారత రత్న పురస్కారం అందుకోనున్న అద్వానీకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం అద్వానీకి భారత రత్న అవార్డు ప్రకటించడంపై శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. భారత రాజకీయాల్లో కురు వృద్ధుడిగా అద్వానీ అందించిన సేవలు ఉన్నతమైనవని చెప్పారు. దేశానికి ఉప ప్రధానిగా, బీజేపీ అగ్ర నాయకుడిగా దేశ అభివృద్ధిలో పాలు పంచుకున్నారన్నారు.