HCU భూములను కబ్జా చేసేందుకు కుట్ర.. విద్యార్థుల ఆందోళన

HCU భూములను కబ్జా చేసేందుకు కుట్ర.. విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ భూములపై అధికార పార్టీ నేతలు, ఉద్యోగ సంఘాల నేతలు కన్నేశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దాదాపు 4వందల ఎకరాల్ని కబ్జా చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వీళ్లతో పాటే రెవెన్యూ అధికారులు కూడా కబ్జాలో పాలు పంచుకుంటున్నారని విమర్శిస్తున్నారు. అక్రమాల్ని ప్రశ్నిస్తే కేసులు పెడతామని పోలీసులు బెదిరిస్తున్నారని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ప్రాణం ఉన్నవరకు యూనివర్శిటీ భూమిని ఇంచుకూడా కబ్జాకు కానివ్వమని అంటున్నారు.