
పంజాగుట్ట, వెలుగు: ఉచిత గుండె ఆపరేషన్ కోసం రాష్ట్ర నలుమూలల నుంచి పిల్లలతో తల్లిదండ్రులు నిమ్స్ ఆస్పత్రి మిలీనియం బ్లాకు వద్దకు భారీగా తరలివచ్చారు. ఆదివారం ఆపరేషన్ ప్రారంభం కాలేదు. పిల్లలతో వచ్చిన వారికి టోకెన్లు ఇచ్చారు. వాటిని తీసుకున్న వారికి ఈనెల29న రావాలని డాక్టర్లు చెప్పారు. దీంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎప్పుడో చేసే ఆపరేషన్ కు ఇప్పుడే ఎందుకు రమ్మన్నారంటూ అధికారులను, డాక్టర్లను వారు ప్రశ్నించారు.