చెన్నై: గుట్దు చప్పుడు కాకుండా ఆట బొమ్మల బాక్సుల్లో బంగారం దాచి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన. దుబాయ్ ప్రయాణికుడిని చెన్నై ఎయిర్ కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రయాణికుడికి చెందిన భారీ మొత్తంలో బంగారాన్ని చెన్నై ఎయిర్ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడు ముందు విమానాశ్రాయానికి చేరుకోగా.. బ్యాగు తర్వాత వచ్చిందని చెన్నై ఎయిర్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ అధికారులు చెబుతున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం దుబాయ్ నుంచి ఓ ప్రయాణికుడు విమానాశ్రయానికి వచ్చాడు. అతని బ్యాగు ఆ తర్వాత విమానాశ్రయానికి చేరుకుంది. ఆ బ్యాగును తనిఖీ చేసినపుడు, ఆట బొమ్మలను భద్రపరిచే పెట్టెలు, బెడ్స్ప్రెడ్స్లో రహస్యంగా ఉంచిన గోల్డ్ ఫాయిల్స్ను అధికారులు గుర్తించారు. వీటి బరువు 1.45 కేజీలు కాగా, వీటి విలువ రూ.78.40 లక్షలు ఉంటుంది. ఆ ప్రయాణికుడిని అరెస్టు చేశారు.