ముంబాయి ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత

ముంబాయి ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత

ముంబాయి అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం, విదేశీ కరెన్సీని పట్టుకున్నారు DRI బృందం. ఆఫ్రికా నుండి ముంబాయికి బంగారం,విదేశీ కరెన్సీని తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో DRI బృందం తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీలో భారీగా బంగారాన్ని సీజ్ చేశారు. ఈ ఆపరేషన్ లో 9.67 కేజీల బంగారం, 18.48 కేజీల వెండి, భారత కరెన్సీ 1.92 కోట్లు మరియు 190000 Usd విదేశీ కరెన్సీని స్వాదీనం చేసుకున్నారు. 

వీటి విలువ మొత్తం రూ. 10.48 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. 2 క్యారియర్ లు, రిక్రూటర్ మరియు మెల్టర్ లను స్వాదీనం చేసుకుని నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు RDI అధికారులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.