ఢిల్లీలో కుండపోత... 6 గంటల్లో 8 సెంటీమీటర్ల వర్షం

ఢిల్లీలో  కుండపోత... 6 గంటల్లో 8 సెంటీమీటర్ల వర్షం
  •  
  • నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు
  • కేరళ, యూపీ, ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ.. 

న్యూఢిల్లీ/తిరువనంతపురం: ఢిల్లీలో వాన దంచికొట్టింది. ఉరుములు మెరుపులు, బలమైన గాలులతో భారీ వర్షం కురిసింది. శనివారం రాత్రి 11:30 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజామున 5:30 గంటల వరకు కుండపోత కురిసింది. అత్యధికంగా సఫ్దర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 8.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పుసాలో 7.1, పాలెంలో 6.81, మయూర్ విహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 4.8 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మోతీబాగ్, మింటో రోడ్, ఐటీవో, ధౌలా కువాన్, కంటోన్మెంట్, దీన్ దయాల్ ఉపాధ్యాయ మార్గ్, చాణక్యపురి తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వరద చేరింది. కొన్నిచోట్ల అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల వద్ద బస్సులు, కార్లు వరదలో చిక్కుకుపోయాయి. గంటకు 60 నుంచి 82 కి.మీ. వేగంతో గాలులు వీయడంతో చెట్లు పడిపోయాయి. కరెంట్స్ పోల్స్ విరిగిపడ్డాయి.

ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టులో కూలిన కానోపీ   

భారీ వర్షానికి ఢిల్లీ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టులో కానోపీ కూలింది. ఈ వీడియో సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాలో వైరల్ అయింది. మరోవైపు వర్షం కారణంగా కొన్ని ఫ్లైట్లను రద్దు చేయగా, మరికొన్నింటిని దారిమళ్లించారు. 49 ఫ్లైట్లను డైవర్ట్ చేసినట్టు ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టు వర్గాలు తెలిపాయి. 180 ఫ్లైట్లు ఆలస్యంగా నడిచాయని పేర్కొన్నాయి. కాగా, భారీ వర్షంతో ఢిల్లీలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. సఫ్దర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 31 నుంచి 21, పుసాలో 31.8 నుంచి 20.5, ప్రగతి మైదాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 31.4 నుంచి 21.3, లోధి రోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 31 నుంచి 22.3 డిగ్రీలకు టెంపరేచర్లు తగ్గాయి. 

కేరళలో కూలిన చెట్లు.. 

రుతుపవనాల రాకతో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అన్ని జిల్లాల్లోనూ వానలు దంచికొడుతున్నాయి. మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కెన్నూర్, కాసరగడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చెట్లు కూలాయి. ఆదివారం ఉదయం త్రిసూర్ జిల్లాలో రైలుపై చెట్టు విరిగిపడింది. లోకోపైలెట్ అప్రమత్తమై వెంటనే రైలును ఆపాడు. దీంతో ప్రమాదం తప్పింది. కోజికోడ్ జిల్లాలో కొబ్బరి చెట్టు విరిగిపడి ఒకరు మృతి చెందారు. చెట్లు విరిగిపడి చాలాచోట్ల ఇండ్లు, షాపులు ధ్వంసమయ్యాయి. పున్నపుజ, కోరపుజ, థోడుపుజ, మువట్టుపుజ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కొన్నిచోట్ల డ్యామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల 
గేట్లు ఎత్తి నీళ్లను కిందికి విడుదల చేస్తున్నారు.