ఖమ్మం జిల్లాలో భారీ వర్షం.. నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

ఖమ్మం జిల్లాలో భారీ వర్షం.. నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

ఖమ్మం జిల్లాలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో సత్తుపల్లిలోని  జే.వి.ఆర్.ఓసి, కిష్టారం ఓసి లల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. జేవిఆర్ ఓసిలో 16 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 70 వేల క్యూబిక్ మీట్లర్ ఓబీకి అంతరాయం ఏర్పడింది. కిష్టారం ఓసిలో 6 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 50 వేల క్యూబిక్ మీటర్ల ఓబికి అంతరాయం కలిగింది.

ఉపరితల గనులల్లో భారీగా వరద నీరు చేరటంతో బోగ్గు గనుల బ్లాక్ లు చిత్తడి చిత్తడిగా మారాయి. వాహనాలు దిగపడటంతో డ్రైవర్లు ఎక్కడికక్కడే  నిలిపివేశారు. గనుల్లో నిలిచిన వర్షపు నీరును మోటర్ల సహయంతో బయటకు తోడుతున్నారు కార్మికులు.