భారీగా ట్రాఫిక్ జామ్....

భారీగా ట్రాఫిక్ జామ్....

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ సమీపంలోని రాయికల్ టోల్ ప్లాజా దగ్గర భారీగా జామ్ ఏర్పడింది. రోడ్డు మరమ్మతు పనులు జరుగుతుండడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో రాయికల్ టోల్ ప్లాజా నుంచి షాద్ నగర్ పట్టణం వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. ట్రాఫిక్ జామ్  కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.