తిరుమల కొండపై మరోసారి హెలికాప్టర్ వెళ్లడంతో కలకలం రేగింది. ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం తిరుమల ఆలయంపై ఎలాంటి విమానాలు.. హెలికాఫ్టర్లు ప్రయాణించకూదు. అలా వెళ్లడం వలన ఆలయ పవిత్రత దెబ్బతింటుంది. ఈ రోజు ( జూన్ 17) ఉదయం శ్రీవారి ఆలయంపై ఓ హెలికాప్టర్ చక్కర్లు కొట్టింది.
తిరుమలను నో ఫ్లైయింగ్ జోన్ గా ప్రకటించాలని అనేక మార్లు కోరన కేంద్ర విమానయాన శాఖను టీటీడీ కోరింది. ప్రస్తుత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి టీటీడీ గతంలోనే లేఖ రాసింది. త్వరలో ఈ విషయంపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి పౌర విమానయానశాఖ నిర్ణయం తీసుకోనుంది.
