
- ఉత్తరకాశీలోని గంగోత్రి యాత్రకు వెళ్తుండగా ప్రమాదం
డెహ్రాడూన్: ఉత్తరకాశీకి దగ్గరలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో పైలట్ సహా ఆరుగురు టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. గురువారం ఉదయం ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ నుంచి పైలట్, ఆరుగురు టూరిస్టులతో బయల్దేరిన ప్రైవేట్ హెలికాప్టర్.. ఉత్తరకాశీకి కొద్దిదూరంలో కూలిపోయింది. దీంతో చాపర్లోని పైలట్తోపాటు ఐదుగురు టూరిస్టులు స్పాట్లోని చనిపోయారు. హెలికాప్టర్లో ఇద్దరు ఆంధ్రప్రదేశ్కు చెందినవారు ఉన్నట్లుగా గుర్తించారు.
అనంతపురం ఎంపీ లక్ష్మీనారాయణ సోదరి వేదవతి కుమారి ప్రమాదంలో చనిపోయినట్లు నిర్ధారించారు. ఆమె భర్త భాస్కర్(51) గాయాలతో బయటపడగా రెస్క్యూ సిబ్బంది రుషికేశ్లోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వీరంతా గంగోత్రి తీర్థయాత్రకు వెళ్తుండగా హెలికాప్టర్ క్రాష్ అయిందని అధికారులు తెలిపారు. ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.