చెన్నై : IPL సీజన్-12 క్లైమాక్స్ కి చేరింది. మొదటి క్వాలిఫయర్ మ్యాచ్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై బ్యాటింగ్ ఎంచుకుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.మొదటి క్వాలిఫయర్ మ్యాచ్లో చెన్నై నుంచి డుప్లెసిస్, ఎస్ వాట్సన్, ఎస్ రైనా, ఎమ్ విజయ్, ఎమ్ఎస్ ధోనీ, ఏ రాయుడు, ఆర్ జడేజా, డీజే బ్రావో, డీ చాహర్, హర్భజన్ సింగ్, ఐ తాహిర్ బరిలో ఉన్నారు.
ముంబై ఇండియన్స్ జట్టు నుంచి డికాక్, రోహిత్ శర్మ, ఐ కిషన్, ఎస్ యాదవ్, కే పొలార్డ్, హెచ్ పాండ్యా, కే పాండ్యా, జే యాదవ్, ఆర్ చాహర్, ఎల్ మలింగా, జే బుమ్రా బరిలో ఉన్నారు.