నా అభిమాని చనిపోవడంతో మనస్తాపానికి గురయ్యా : ఎన్టీఆర్

నా అభిమాని చనిపోవడంతో మనస్తాపానికి గురయ్యా : ఎన్టీఆర్

హైదరాబాద్‌: తన అభిమాని, ఆప్త మిత్రుడయిన జయదేవ్‌ చనిపోయారన్న వార్త తెలిసి మనస్తాపానికి గురయ్యానని తెలిపాడు హీరో  ఎన్టీఆర్‌. కృష్ణా జిల్లా అభిమాన సంఘం ప్రతినిధి జయదేవ్‌ సోమవారం కన్నుమూశారు. ఆయనకు సంతాపం తెలియజేస్తూ ఎన్టీఆర్ సోషల్‌మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు.‘నాకు అత్యంత ఆప్తుడయిన జయదేవ్‌ ఇక లేరన్న వార్త తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. ‘నిన్ను చూడాలని’ సినిమాతో మొదలయిన మా ప్రయాణం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోతుందని ఊహించలేదు.

ఓ నటుడిగా నా కష్టసుఖాల్లో అభిమానులు నా వెన్నంటే ఉన్నారు. నేను వేసిన తొలి అడుగు నుంచి నేటి వరకు తోడుగా ఉన్నవారిలో జయదేవ్‌ చాలా ముఖ్యమైన వ్యక్తి. జయదేవ్‌ లేని లోటు నాకు తీరనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను’ అని ట్వీట్ చేశాడు. జయదేవ్‌తో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.