
‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ చిత్రంతో హీరోయిన్గా పరిచయం అవుతోంది తెలుగ మ్మాయి శివాని నాగరం. సుహాస్ హీరోగా దుశ్యంత్ కటికినేని దర్శకత్వంలో ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ శివాని మాట్లాడుతూ ‘నాది హైదరాబాద్. ఫ్రెండ్ రోల్ అనుకుని ఆడిషన్కు వెళ్లగా, హీరోయిన్గా అవకాశం వచ్చింది. ఫస్ట్ డే షూట్ వరకు నేనే హీరోయిన్ అని నమ్మలేకపోయా. ఒక పెద్ద బ్యానర్లో మంచి కంటెంట్ ఉన్న సినిమాతో హీరోయిన్గా పరిచయం అవడం హ్యాపీ.
ఇందులో నా పాత్ర పేరు లక్ష్మి. కొన్ని ఎమోషనల్ సీన్స్ చేయడం చాలెంజింగ్గా అనిపించింది. అయితే నెలరోజులు ముందుగానే రిహార్సల్స్ చేయ డం వల్ల సెట్లో కష్టమనిపించలేదు. సుహాస్తో వర్క్ చేయడం హ్యాపీ. తన నుంచి మంచి సపోర్ట్ లభించింది. దుశ్యంత్ గారు కథలో ప్రతి ఒక్కరి క్యారెక్టర్కు ఇంపార్టెన్స్ ఇచ్చారు. నా పాత్రకు మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నా. కేవలం హీరోయిన్గానే కాకుండా కథలో ప్రాధాన్యత ఉండి, నటిగా నిరూపించుకునే అవకాశమున్న పాత్రలు చేయాలనుకుంటున్నా. ఇందులో ‘గుమ్మా’ అనే పాట నా ఫేవరేట్ సాంగ్. కొన్ని ఆఫర్స్ వచ్చాయి. ఈ సినిమా రిజల్ట్ను బట్టి కొత్త ప్రాజెక్ట్కు సైన్ చేయబోతున్నా’ అని చెప్పింది.