సినిమా..సినిమా..సినిమా! నిన్ను చూచాను..నన్ను మరిచాను. అనే మాట అందరు వినే ఉంటారు. అలాంటి స్వచ్ఛమైన ఫీలింగ్ ను..సినిమా చూసిన ఆడియాన్ కు ఇస్తోంది. అదే ఆ సినిమా తీసినవారికి మరో రకమైన అనుభూతిని ఇస్తోంది.ఇలా సినిమా అనేది..అన్ని రకాల భావోద్వేగాలను అందిస్తుంటోంది.
లేటెస్టుగా హీరోయిన్ తాప్సీ..ప్రొడ్యూసర్గా మారి సినిమాలు నిర్మిస్తోంది. ఇన్నాళ్లు సినిమాల్లో హీరోయిన్గా నటించిన ఆమె..ప్రొడ్యూసర్ గా అడుగుపెట్టి..తనకు కలిగిన ఫీలింగ్ను ఇలా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సినిమాలు అన్నీ బిజినెస్ పరంగానే నడుస్తున్నట్లు తెలిపింది. చిన్న సినిమాల నిర్మాణం ఎలా ఉంటుంది? థియేటర్లో కాకుండా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేస్తే..అప్పుడు వాటి పరిస్థితి ఏంటి? హిట్ అయితే ఎలా ఉంటోంది? ప్లాప్ అయితే ఎలా ఉంటుంది? అనే విషయాలపై మాట్లాడింది.
'చిన్న బడ్జెట్ సినిమాలు ఓటీటీ ద్వారా వెళితే ..సినిమా బడ్జెట్కి పెట్టిన ఖర్చుని మాత్రమే రికవరీ చేస్తున్నాయి. అలా ఓటీటీలోకి తీసుకెళ్లాలన్నా..ఎంతో కొంత ముందుగానే పబ్లిసిటీ చేయాలి. ఆ ఖర్చు కూడా అదనంగా సినిమా నిర్మించిన నిర్మాతనే చూసుకోవాలి. ఆ ఖర్చులు కూడా కొన్నిసార్లు తిరిగి రావడం లేదు.ఇక తీరా..రిస్క్ చేసి థియేటర్లలో రిలీజ్ చేద్దాం అనుకున్నా..సరైన రిలీజ్ డేట్ దొరకడం కష్టమవుతుంది. అందువల్ల అలాంటి సినిమాలకు ఏటువంటి గుర్తింపు కూడా దక్కడం లేదు. ఇక మన అదృష్టం బాలేక..చివరికి సినిమా పై ప్లాప్ అనే ముద్ర పడుతుంది. పైగా ఇప్పుడొచ్చే సినిమాలన్నీ ఎనిమిది వారాల తర్వాత ఓటీటీ లో రిలీజ్ అవుతున్నాయి. అప్పుడు కూడా థియేటర్లో సక్సెస్ అయిన మూవీని మాత్రమే ఓటీటీ ఆడియన్స్ చూస్తున్నారు.
రీసెంట్గా హీరోయిన్ తాప్సీ ధక్ ధక్ అనే మూవీతో ప్రొడ్యూసర్గా మారింది.ఇందులో ఫాతిమా సనా షేక్- దియా మీర్జా - సంజన సంఘీ నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా హిట్ టాక్ తెచ్చుకోలేదు. దీంతో హీరోయిన్ తాప్సికి మొదట్లోనే నష్టాలు తప్పలేదు.ప్రస్తుతం తాప్సీ బాలీవుడ్ లో వరుస మూవీస్ లో నటిస్తోంది. రీసెంట్ షారుఖ్ డంకీ మూవీలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.