ఆర్టీసీ బహిరంగ సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఆర్టీసీ బహిరంగ సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఆర్టీసీ కార్మికులు హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో రేపు(బుధవారం) నిర్వహించతలపెట్టిన బహిరంగ సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సభకు ముందుగా పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆర్టీసీ కార్మికులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై  కోర్టు విచారణ చేపట్టింది. అనుమతి ఎందుకు నిరాకరిస్తున్నారో ఈ సాయంత్రం 4 గంటల్లోపు తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సరూర్‌నగర్‌  గ్రౌండ్ లో కాకుండా సభకు ఎక్కడ అనుమతిస్తారో తెలపాలని హైకోర్టు స్పష్టం చేసింది.

హైకోర్టు విచారణలో వాదనల తర్వాత హైకోర్టు సభకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సరూర్ నగర్ లో రేపు మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు సభ నిర్వహించుకోవచ్చని అనుమతిచ్చింది.