హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ వార్ రూమ్లో నిబంధనలకు విరుద్ధంగా తనిఖీలు నిర్వహించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని సిటీ పోలీస్ కమిషనర్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ముఖాల్ని మార్ఫింగ్ చేసి సోషల్మీడియాలో పోస్ట్ చేశారన్న ఆరోపణలతో.. 2022, డిసెంబర్ 13న రాత్రి మాదాపూర్లోని మైండ్ షేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పీసీసీ నిర్వహిస్తున్న వార్రూమ్లో పోలీసులు తనిఖీలు నిర్వహించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ చర్యను తప్పుపడుతూ మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత మల్లు రవి హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.
సైబర్ క్రైమ్స్ ఏఎస్సీ ప్రసాద్, సీఐ రమేశ్ తమ సిబ్బందితో ఆఫీసులోకి చొరబడి నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారని చెప్పారు. ఈ పిటిషన్ను ఇటీవల హైకోర్టు విచారించింది. సీఆర్పీసీ సెక్షన్ 41ఎ కింద నోటీసు ఇవ్వకుండా వార్ రూమ్లో సోదాలకు ఎలా వెళ్లారు? ఆ ముగ్గురిని ఏవిధంగా అదుపులోకి తీసుకున్నారు? అని ప్రశ్నించింది. సీఐ ఆఫీస్కు తీసుకెళ్లాల్సిన అవసరం ఏముందని ఆక్షేపించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆ పోలీసులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సిటీ పోలీస్ కమిషనర్ను ఆదేశిస్తూ జస్టిస్ కె.లక్ష్మణ్ ఇటీవల తీర్పు వెలువరించారు.