కాశిం రిట్​ విచారణ : వాయిదా వేసిన హైకోర్టు

కాశిం రిట్​ విచారణ : వాయిదా వేసిన హైకోర్టు

సమయం మించిపోవడంతో వాయిదా వేసిన హైకోర్టు

హైదరాబాద్‌‌, వెలుగు: ఓయూ తెలుగు విభాగం అసోసియేట్‌‌ ప్రొఫెసర్‌‌ సీహెచ్‌‌ కాశిం అరెస్ట్​ను సవాల్‌‌ చేసిన రిట్‌‌ను 6న విచారిస్తామని హైకోర్టు మంగళవారం ప్రకటించింది. రాష్ట్ర పౌరహక్కుల సంఘం ప్రెసిడెంట్‌‌ గడ్డం లక్ష్మణ్‌‌ వేసిన రిట్‌‌ మంగళవారం విచారణకు రావాల్సి ఉండె. కోర్టు సమయం ముగియడంతో లాయర్‌‌ దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతో 6న విచారిస్తామని చీఫ్‌‌ జస్టిస్‌‌ ఆర్ఎస్‌‌ చౌహాన్, జడ్జి జస్టిస్‌‌ అభిషేక్‌‌రెడ్డిల డివిజన్‌‌ బెంచ్‌‌ ఉత్తర్వులిచ్చింది.