పూర్తి పరిహారం ఇచ్చేదాకా ఇండ్లు కూల్చొద్దు

పూర్తి పరిహారం ఇచ్చేదాకా ఇండ్లు కూల్చొద్దు

మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లోని ఒంటరి మహిళలు, పురుషులకు పూర్తి ఆర్ అండ్ ఆర్ ఇవ్వాలని హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. అప్పటి వరకు వారి ఇండ్లను కూల్చకూడదని స్పెషల్ హరిత డివిజన్ బెంచ్ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను జూలై 9కి వాయిదా వేసింది. వేములఘాట్, ఏటిగడ్డకిష్టాపూర్ గ్రామస్తులు తమ తమ ఆధార్ కార్డులను తీసుకొని కలెక్టర్ సమక్షంలో ఆర్ అండ్ ఆర్ బెనిఫిట్స్ తీసుకోవాలని హైకోర్ట్ సూచించింది. పిటిషనర్లకు ఇవ్వాల్సిన చెక్కులు సిద్ధంగా ఉన్నాయని చెప్పిన ప్రభుత్వ వాదనను అంగీకరిస్తూ.. మిగతా వారికి కూడా ఇవ్వాలని.. మళ్ళీ జులై 9న వ్రాత పూర్వకంగా హైకోర్టుకు తెలపాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.