సుప్రీంకోర్టు చెప్పేవరకు ఎల్ఆర్ఎస్ అమలు చేయొద్దు

సుప్రీంకోర్టు చెప్పేవరకు ఎల్ఆర్ఎస్ అమలు చేయొద్దు

సుప్రీంకోర్టు నిర్ణయించే వరకు ఎల్ఆర్ఎస్ అమలుకు బలవంతపు చర్యలు చేపట్టొద్దని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టులో ఈ కేసు గురించి తేలే వరకు బీఆర్ఎస్ దరఖాస్తులపై తుది నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు సూచించింది. అనధికార లేఅవుట్‌లు, భవనాల క్రమబద్ధీకరణ పై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే ఎల్ఆర్ఎస్‌పై సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉన్నందని రాష్ట్ర ప్రభుత్వం
 హైకోర్టుకు తెలిపింది. అంతేకాకుండా.. సుప్రీంకోర్టులో ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదని కూడా తెలిపింది. అయితే కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున తాము విచారణ జరపాల్సిన అవసరం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాకుండా ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్‌లపై దాఖలైన పిటిషన్లన్నింటిపై హైకోర్టు విచారణ ముగించింది.