మధుసూదన్ డెత్ సర్టిఫికెట్ అతడి భార్యకు ఇవ్వండి

మధుసూదన్ డెత్ సర్టిఫికెట్ అతడి భార్యకు ఇవ్వండి

హైదరాబాద్‌: గాంధీ హాస్పిటల్ లో చేరిన తన భర్త ఆచూకీ తెలపాలని హైదరాబాద్, వనస్థలిపురానికి చెందిన మధుసూదన్ భార్య దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. దీనిపై పూర్తి వివరాలు ఇవ్వాలని గురువారం సర్కారును హైకోర్టు ఆదేశించగా.. మధుసూదన్ కరోనాతోనే మృతిచెందినట్లు హైకోర్టుకు  ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. దీంతో ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన హైకోర్టు.. మధుసూదన్ డెత్ సర్టిఫికెట్, చితాభస్మం అతని భార్యకు అప్పగించాలని ఆదేశించింది.