మార్కెట్ కు స్థలం కేటాయింపుపై హైకోర్టు స్టే

మార్కెట్ కు స్థలం కేటాయింపుపై హైకోర్టు స్టే

నల్గొండ జిల్లా దేవరకొండలో మార్కెట్ కు స్థలం కేటాయింపుపై హైకోర్టు స్టే విధించింది. కూరగాయలు, మాసం మార్కెట్ కోసం కాలేజీకి చెందిన 2 ఎకరాలను కలెక్టర్ కేటాయించారు. అయితే అక్కడి విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని కలెక్టర్ నిర్ణయాన్ని ఇంటర్ విద్యా కమిషనర్ వ్యతిరేకించారు. మార్కెట్ కు స్థలం కేటాయింపుపై న్యాయవాది టి. రవికుమార్ పిల్‌ దాఖలు చేయగా..దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది.

ALSO READ:కాబోయే కొడలును పరిచయం చేసిన సిద్ధూ 

ఈ నేపథ్యంలో జూనియర్ కాలేజీ స్థలాన్ని మార్కెట్ కు కేటాయింపును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వలు జారీ చేసింది. అయితే రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శికి, కలెక్టర్‌కు, ఇంటర్ విద్య కమిషనర్‌కు, కాలేజీ ప్రిన్సిపల్‌కు కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు నోటీసులు పంపింది. తదుపరి విచారణ ఆగస్టు 18కి వాయిదా వేసింది.