ప్రణయ్ హత్య కేసులో నిందితులకు బెయిల్

ప్రణయ్ హత్య కేసులో నిందితులకు బెయిల్

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితులు ముగ్గురికి హై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన తిరునగరు మారుతీ రావు, ఆయన తమ్ముడు శ్రవణ్ కుమార్, ఖరీంలపై గత ఏడాది సెప్టెంబర్ లో పోలీసులు పీడీ యాక్టు నమోదు చేశారు. ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైలులో ఉన్న మారుతీరావు సహా నిందితులు రెండు నెలల క్రితం హై కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో జిల్లా ఎస్పీ రంగనాథ్, మిర్యాలగూడ డీఎస్పీ కె శ్రీనివాస్ లు బెయిల్ మంజూరు ఇవ్వరాదని వాదించడంతో హై కోర్టు బెయిల్ నిరాకరించింది. పీడీ యాక్టు కేసులో నిందితులు ముగ్గురు మరోసారి పిటిషన్ దాఖలు చేయగా…విచారించిన హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.