కార్మికుల ఆందోళన... గంగవరం పోర్టు దగ్గర ఉద్రిక్తత

కార్మికుల ఆందోళన... గంగవరం పోర్టు దగ్గర ఉద్రిక్తత

ఏపీలోని విశాఖ జిల్లా గంగవరం పోర్టు దగ్గర ఉద్రిక్తత  పరిస్థితి ఏర్పడింది. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ  కార్మికులు చేపట్టిన పోర్టు బంద్ ఉద్రిక్తతకు దారితీసింది. ఈ  ఆందోళనలో పలువురు పోలీసులు, కార్మికులకు గాయలయ్యాయి.  పోర్టులోకి చొచ్చుకెళ్లేందుకు కార్మికులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ తోపులాటలో  ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. 

ఈ ఘటనలో 10 మంది పోలీసులు, కార్మికులు  గాయపడ్డారు. గాజువాక సీఐ కాలిలోకి ముళ్లకంచె దగగా ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్రగాయాలయ్యాయి.  తొలగించిన పోర్టు కార్మికులను విధుల్లోకి తీసుకోవడంతో పాటు కనీసం వేతనం 36 వేలు చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.