ఏపీలోని విశాఖ జిల్లా గంగవరం పోర్టు దగ్గర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ కార్మికులు చేపట్టిన పోర్టు బంద్ ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఆందోళనలో పలువురు పోలీసులు, కార్మికులకు గాయలయ్యాయి. పోర్టులోకి చొచ్చుకెళ్లేందుకు కార్మికులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ తోపులాటలో ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది.
ఈ ఘటనలో 10 మంది పోలీసులు, కార్మికులు గాయపడ్డారు. గాజువాక సీఐ కాలిలోకి ముళ్లకంచె దగగా ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్రగాయాలయ్యాయి. తొలగించిన పోర్టు కార్మికులను విధుల్లోకి తీసుకోవడంతో పాటు కనీసం వేతనం 36 వేలు చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.