ఏపీ తెలంగాణ బార్డర్లో భారీగా నిలిచిన వాహనాలు

ఏపీ తెలంగాణ బార్డర్లో భారీగా నిలిచిన వాహనాలు

తెలంగాణ,ఆంధ్ర సరిహద్దులో పోలీసులు ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. పాసులున్నవారినే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. దీంతో సూర్యాపేట జిల్లా 
కోదాడ మండలం రామాపురం దగ్గర భారీగా వెహికిల్స్ నిలిచిపోయాయి. అత్యవసర సేవల్లో భాగంగా అంబులెన్సులను మాత్రమే అనుమతిస్తున్నారు. పాసులు లేని వాహనాలను అక్కడే ఆపేస్తున్నారు.  దీంతో కిలోమీటర్ల దూరం వరకు వాహనాలు ఆగిపోయాయి. కొంతమంది వాహనదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు.