హైదరాబాద్‎లో ‘హైరైజ్’ కల్చర్పెరుగుతోంది: కె.రాజ్కుమార్

హైదరాబాద్‎లో ‘హైరైజ్’ కల్చర్పెరుగుతోంది: కె.రాజ్కుమార్

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్‎లో హైరైజ్​భవనాల నిర్మాణాలు మరింత వేగంగా పెరిగే అవకాశముదని అసోసియేషన్​ఆఫ్​కన్సల్టింగ్​సివిల్​ఇంజనీర్స్​(ఇండియా) హైదరాబాద్​చాప్టర్​అంచనా వేసింది. మారుతున్న నిర్మాణ తీరు, పెరుగుతున్న టెక్నాలజీ దీనికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు. మంగళవారం అసోసియేషన్​మీడియా సమావేశం నిర్వహించగా సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు కె.రాజ్​కుమార్​మాట్లాడారు. 

సిటీలో హైరైజ్​బిల్డింగ్​కల్చర్​పెరుగుతుండగా, నూతన డిజైన్లు, కొత్త టెక్నాలజీని పరిచయం చేసేందుకు జూలై 11, 12 తేదీల్లో ఇంజినీరింగ్​స్టాఫ్​కాలేజీ ఆఫ్​ ఇండియా (అస్కీ) ఆడిటోరియంలో జాతీయ కాన్ఫరెన్స్​ఉంటుందన్ని చెప్పారు. ఈ కాన్ఫరెన్స్‎కు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 800 మంది ప్రతినిధులు పాల్గొంటారని, అలాగే దేశ విదేశాలకు చెందిన 14 మంది నిపుణులు హాజరవుతారని చెప్పారు. హైరైజ్​ భవన నిర్మాణాల్లో వస్తున్న కొత్తపోకడలు, టెక్నాలజీ, అడ్వాన్స్​డ్​ కాంపొజిట్​ స్టీల్​ స్ర్టక్చర్స్​ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలిపారు.