
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్లో హైరైజ్భవనాల నిర్మాణాలు మరింత వేగంగా పెరిగే అవకాశముదని అసోసియేషన్ఆఫ్కన్సల్టింగ్సివిల్ఇంజనీర్స్(ఇండియా) హైదరాబాద్చాప్టర్అంచనా వేసింది. మారుతున్న నిర్మాణ తీరు, పెరుగుతున్న టెక్నాలజీ దీనికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు. మంగళవారం అసోసియేషన్మీడియా సమావేశం నిర్వహించగా సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు కె.రాజ్కుమార్మాట్లాడారు.
సిటీలో హైరైజ్బిల్డింగ్కల్చర్పెరుగుతుండగా, నూతన డిజైన్లు, కొత్త టెక్నాలజీని పరిచయం చేసేందుకు జూలై 11, 12 తేదీల్లో ఇంజినీరింగ్స్టాఫ్కాలేజీ ఆఫ్ ఇండియా (అస్కీ) ఆడిటోరియంలో జాతీయ కాన్ఫరెన్స్ఉంటుందన్ని చెప్పారు. ఈ కాన్ఫరెన్స్కు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 800 మంది ప్రతినిధులు పాల్గొంటారని, అలాగే దేశ విదేశాలకు చెందిన 14 మంది నిపుణులు హాజరవుతారని చెప్పారు. హైరైజ్ భవన నిర్మాణాల్లో వస్తున్న కొత్తపోకడలు, టెక్నాలజీ, అడ్వాన్స్డ్ కాంపొజిట్ స్టీల్ స్ర్టక్చర్స్ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలిపారు.