హైదరాబాద్: మైలార్ దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హిట్ అండ్ రన్ కేసు నమోదు అయ్యింది. బైక్ను ఢీకొట్టిన కారు 200 మీటర్లు ఈడ్చుకెళ్లింది. వెంబడించి కారును పట్టుకున్న స్థానికులు కార్ డ్రైవర్ను చితకబాది పోలీసులకు అప్పగించారు. వివరాల ప్రకారం.. ఆదివారం (మార్చి 8) రాత్రి నలుగురు యువకులు షాద్ నగర్ నుంచి చార్మినార్కు షాపింగ్కు వెళ్తున్నారు.
ఈ క్రమంలో మైలార్ దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పల్లె చెరువు దగ్గర మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కారు బైక్లను ఢీకొట్టింది. ఓ బైక్ కారు ముందు భాగంలో ఇరుక్కున్నప్పటికీ కారు ఆపకుండా అలాగే 200 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లాడు కార్ డ్రైవర్. కారును వెంబడించి పట్టుకున్న స్థానికులు డ్రైవర్ను చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై మైలార్ దేవ్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారు నడిపిన వ్యక్తిని కిశోర్కు గుర్తించారు.
