మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన మేజర్ సినిమా ద్వారా హీరో అడవి శేష్ ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. అతని నెక్స్ట్ సినిమా హిట్- ద సెకండ్ కేసుపై ఫ్యాన్స్ ఇప్పటికే ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆ మూవీపై అడవి శేషు ఓ అప్ డేట్ ఇచ్చారు. హిట్-2 సినిమా షూటింగ్ నుంచి కొన్నిరోజులు బ్రేక్ తీసుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇన్ని రోజులూ మేజర్ మూవీని ప్రచారం చేయడంలో బిజీబిజీగా గడిపానని... కాస్త అలసిపోయానని అందుకే బ్రేక్ తీసుకుంటున్నట్లు చెప్పారు. ఫైనల్ షెడ్యూల్ వచ్చే నెలలో ప్రారంభమవుతుందని తెలిపారు. సినిమా ప్రొడ్యూసర్ నాని, డాక్టర్ శైలేష్ గారిని కొన్ని రోజులు బ్రేక్ కావాలని అడిగానన్న ఆయన... దానికి వాళ్లు ఒప్పుకున్నారని, కొన్నిరోజులు రెస్ట్ తీసుకుని మళ్లీ హిట్-2 షూటింగ్ మొదలుపెడతామని స్పష్టం చేశారు. హిట్-2 కి సంబంధించిన అప్డేట్స్తో మళ్లీ త్వరలోనే మీ ముందుకు వస్తానంటూ శేష్ చెప్పారు. మేజర్ సినిమాలాగే హిట్-2ను ఆదరించడానికి రెడీగా ఉండండి.’ అని అడవి శేష్ ట్వీట్ చేశారు.
#HIT2 will come with a BANG!
— Adivi Sesh (@AdiviSesh) July 23, 2022
But at the right time ?#FinalSchedule Next Month pic.twitter.com/KbljRmx386