నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: బడిబాట కార్యక్రమానికి బైక్పై వెళ్తుండగా పంది అడ్డం రావడంతో కిందపడి ఓ హెడ్మాస్టర్ తీవ్ర గాయాలతో చనిపోయారు. ఆదివారం బడిబాట కార్యక్రమానికి హెచ్ఎం బిచ్చారావు(50) నాగర్ కర్నూల్ నుంచి తాడూరు మండలం మేడిపూరు గ్రామానికి బైక్ పై వెళ్తుండగా, ఎండబెట్ల గ్రామ శివారులో పంది అడ్డం వచ్చింది. దీంతో బైక్ అదుపుతప్పి కిందపడిన హెచ్ఎంకు తీవ్రగాయాలయ్యాయి. హైదరాబాద్ లో ఓ హాస్పిటల్లో తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయారు. ఆయనకు భార్య, కూతురు ఉన్నారు.
