
- బల్దియా కమిషనర్తో హెచ్ఎండీఏ జాయింట్ సెక్రటరీ ఆమ్రపాలి చర్చలు
హైదరాబాద్, వెలుగు : జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ను హెచ్ఎండీఏ జాయింట్ సెక్రటరీ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ ఆమ్రపాలి గురువారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వీరు చర్చించారు. ప్రధానంగా మూసీపై చర్చించినట్లు తెలుస్తోంది. మూసీ డెవలప్మెంట్ పై రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. ఈ నేపథ్యంలో మూసీపై జరుగుతున్న బ్రిడ్జిల నిర్మాణాలు, మూసీ ఆక్రమణలపై ఏం చేయాలనే దాంతో పాటు ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం.