ఇయ్యాల మోకిల ప్లాట్లపై ప్రీ బిడ్ మీటింగ్.. ఆగస్టు 23 నుంచి ఆన్ లైన్​లో వేలం

ఇయ్యాల మోకిల ప్లాట్లపై ప్రీ బిడ్ మీటింగ్.. ఆగస్టు 23 నుంచి ఆన్ లైన్​లో వేలం

హైదరాబాద్, వెలుగు: మోకిల ఫేజ్ 2 లో ఈ నెలలో జరగనున్న ప్లాట్ల వేలంపై గురువారం హెచ్ఎండీఏ అధికారులు ప్రీ బిడ్ మీటింగ్​ నిర్వహించనున్నారు. మొత్తం 300 ప్లాట్లకు ఈ నెల 23 నుంచి 5 రోజులపాటు రోజుకు 60 ప్లాట్లకు ఆన్ లైన్​లో వేలం జరగనుంది. 300 గజాల నుంచి 500 గజాల వరకు ప్లాట్లు ఉండగా కనీస ధర గజానికి రూ.25వేలుగా అధికారులు ఖరారు చేశారు. ప్లాట్ల వేలం ద్వారా రూ.850 కోట్లు లాభం వస్తుందని హెచ్ఎండీఏ అంచనా వేస్తోంది. ఫేజ్ 1 లో వేలం నిర్వహించినప్పుడు గజం లక్ష వరకు పలకింది.