హైదరాబాద్, వెలుగు : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మంగళవారం రాష్ట్రానికి రానున్నారు. ఢిల్లీ నుంచి మధ్యాహ్నం 1.20 గంటలకు ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి సికింద్రాబాద్లోని ఇంపీరియల్ గార్డెన్స్లో మధ్యాహ్నం 1.45 గంటల నుంచి 2.45 గంటల వరకు సోషల్ మీడియా వలంటీర్లతో మీటింగ్లో పాల్గొని, వారికి దిశా నిర్దేశం చేయనున్నారు.
తర్వాత ఎల్బీ స్టేడియంలో జరిగే విజయ సంకల్ప సమ్మేళనంలో భాగంగా మధ్యాహ్నం 3.15 గంటల నుంచి సాయంత్రం 4.25 గంటల వరకు బూత్ కమిటీ అధ్యక్షులు, ఆపై స్థాయి నేతలతో జరిగే సమావేశంలో పాల్గొంటారు.
అనంతరం సాయంత్రం 4.45 గంటల నుంచి 5.45 గంటల వరకు ఐటీసీ కాకతీయలో రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశం అవుతారు. ఈ సందర్భంగా లోక్సభ ఎన్నికల కార్యాచరణపై చర్చిస్తారు. తర్వాత సాయంత్రం 6.10 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్కు చేరుకొని, తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు.