హనీమూన్‌‌‌‌‌‌‌‌కు వెళ్లిన జంట సిక్కింలో గల్లంతు.. 12 రోజులైనా దొరకని ఆచూకీ

హనీమూన్‌‌‌‌‌‌‌‌కు వెళ్లిన జంట సిక్కింలో గల్లంతు.. 12 రోజులైనా దొరకని ఆచూకీ

సిక్కిం: హనీమూన్‌‌‌‌‌‌‌‌కు వెళ్లిన ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌కు చెందిన జంట సిక్కింలో గల్లంతైంది. 12 రోజులైనా వీళ్ల ఆచూకీ దొరకలేదు. మరో 10 మందితో కలిసి వీళ్లు ప్రయాణిస్తున్న వెహికల్‌‌‌‌‌‌‌‌ మే 29న ప్రమాదానికి గురై, వెయ్యి అడుగుల లోతున్న తీస్తా నదిలో పడిపోయింది. దీంతో ఈ జంటతోపాటు వెహికల్‌‌‌‌‌‌‌‌లో ఉన్నవారంతా గల్లంతయ్యారు.

 ప్రమాదంలో సిక్కింకు చెందిన డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాణాలు కోల్పోగా, మరొకరు గాయాలతో బయటపడ్డారు. యూపీలోని ప్రతాప్​గఢ్‌‌‌‌‌‌‌‌ జిల్లాలకు చెందిన కౌశలేంద్రకు మే 5న అంకితతో వివాహం కాగా, మే 24న హనీమూన్‌‌‌‌‌‌‌‌కోసం సిక్కింకు వెళ్లారు. 

29న పర్యటనకు వెళ్లిన సమయంలో వాళ్లు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి తీస్తా నదిలో పడిపోయింది. గల్లంతైనవాళ్లకోసం రెస్క్యూ టీమ్స్‌‌‌‌‌‌‌‌ గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు చెప్తున్నారు.