పద్మారావునగర్, వెలుగు : గాంధీ హాస్పిటల్లోని డైట్ క్యాంటీన్ నిర్వహణకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు హాస్పిటల్అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు మంగళవారం ప్రకటించారు. పూర్తి వివరాలు సూపరింటెండెంట్ఆఫీసులోని హెచ్డీఎస్ సెక్షన్లో పొందొచ్చని పేర్కొన్నారు. ఈ నెల 17 వరకు టెండర్ల అప్లికేషన్లు అందుబాటులో ఉంటాయని, 18న మధ్యాహ్నం 12 గంటలకు టెక్నికల్, 2.30కు ఫైనాన్సియల్ బిడ్లు ఓపెన్అవుతాయని స్పష్టం చేశారు.
పేషెంట్లు, డాక్టర్లకు అందిస్తున్న ఫుడ్డుకు పెరిగిన ధరలు వర్తిస్తాయని తెలిపారు. గతంలో పేషెంట్లు, అటెండెంట్లకు ఇచ్చే ఫుడ్డుకు రూ.40 ఇవ్వగా, రూ.80కి పెరిగిందన్నారు. టీబీ, మెంటల్, థెరపెటిక్ పేషెంట్లకు ఇచ్చే ఫుడ్డు రేటు రూ.56 నుంచి రూ.112కు, డ్యూటీ డాక్లర్లకు అందించే ఫుడ్డు రేటు రూ.80 నుంచి రూ.160కి పెరిగిందన్నారు.