చలి కాలం హాస్టల్ స్టూడెంట్ల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఉదయం పూట చన్నీటితో స్నానం చేయలేక వణికిపోతున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల స్కూల్లో సుమారు 400 మంది స్టూడెంట్లు ఉన్నారు. వీరికి స్నానాలు చేసేందుకు అనువైన సౌకర్యాలు లేవు. ట్యాంకు పైపు ద్వారా వచ్చే నీటితో చలిలో వణుకుతూ ఇలా స్నానం చేస్తున్నారు. – తిమ్మాపూర్, వెలుగు
