
హోటల్ రూమ్ లో స్టే చేస్తున్నారా? అయితే జాగ్రత్త..రూంకి వెళ్లినప్పుడు ఎందుకైనా మంచిది ఒక్కసారి గదిని మొత్తం జాగ్రత్తగా పరిశీలించండి. ఎందుకంటే ఈ మధ్య రహస్యంగా కెమెరాలు అమర్చి దంపతులు ఏం చేస్తున్నారో చూస్తున్నారు. అంతేగాకుండా వాటిని రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతున్నాయి.
లేటెస్ట్ గా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీలో ఇలాంటి ఘటనే జరిగింది. ఎయిర్ పోర్ట్ రహదారిలో ఉన్న సీతా గ్రాండ్ హోటల్ రూమ్స్ లో యాజమాన్యం సీసీ కెమెరాలు అమర్చిన విషయం వెలుగులోకి వచ్చింది. లైట్స్ లో అమర్చిన కెమెరాలను గుర్తించిన దంపతులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు హోటల్ ను సీజ్ చేశారు. ఓనర్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఎయిర్ పోర్ట్ పోలీసులు.