- బీజేపి కార్యకర్తలపై టీఆర్ఎస్ దాడులకు పాల్పడుతోంది
హైదరాబాద్: ‘తెలంగాణ ప్రభుత్వం బీజేపి ఎమ్మెల్యేలను హౌజ్ అరెస్టు చేయడం అప్రజాస్వామికం, మేమేమన్న ఉగ్రవాదులమా?’ అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు బీజేపి ఎమ్మెల్యే రాజాసింగ్. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ... . జనగామలో తమ కార్యకర్తలపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని.. పోలీసులు వారికి సహకరించారని రాజాసింగ్ ఆరోపించారు. ఈ క్రమంలోనే తమ నేత బండి సంజయ్ ఆదేశాల మేరకు కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్తుంటే .. ప్రభుత్వం తమని అరెస్టు చేయడం ప్రజా స్వామ్యానికి విరుద్ధమని రాజాసింగ్ విమర్శించారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందన్నారు. ప్రతిపక్షాలను హౌజ్ అరెస్టు చేయడం కాదు.. త్వరలోనే రాష్ట్ర ప్రజలు కేసీఆర్ ను ఫామ్ హౌజ్ అరెస్ట్ చేస్తారన్నారు. కేసీఆర్ కు బీజేపీ ఎమ్యెల్యేలు, ఎంపీలంటే భయం పట్టుకుందని, అందుకే ఈ అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారన్నారు.
ఇవి కూడా చదవండి: