ఐపీఎల్ లో కొత్త జట్టు పేరు గుజరాత్ టైటాన్స్

ఐపీఎల్ లో కొత్త జట్టు పేరు గుజరాత్ టైటాన్స్

ఐపీఎల్ లో కొత్తగా అడుగుపెట్టిన అహ్మదాబాద్ ఫ్రాంచైజీ క్రికెట్ టీమ్ పేరును ప్రకటించింది. అహ్మాదాబాద్ ఫ్రాంచైజీ టీమ్ పేరును గుజరాత్ టైటాన్స్ గా ప్రకటించింది. గత సీజన్ వరకు 8 జట్లతో ఉన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్  ప్రస్తుతం 10 జట్లకు పెరిగింది. మెగా వేలానికి ముందే ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంది. ఇప్పటికే అహ్మదాబాద్ ఫ్రాంచైజీకి కెప్టెన్ గా హార్ధిక్ పాండ్యాను నియమించారు.