మంచిర్యాల జిల్లాలో ఇల్లు దగ్ధం, ఆరుగురు సజీవ దహనం

మంచిర్యాల జిల్లాలో ఇల్లు దగ్ధం, ఆరుగురు సజీవ దహనం

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపెల్లి గ్రామంలో ఇల్లు దగ్ధం కావడంతో, ఆ మంటల్లో చిక్కుకొని ఆరుగురు సజీవ దహనమయ్యారు. చనిపోయిన వారిలో మాసు శివయ్య (50), ఆయన భార్య రాజ్యలక్ష్మి, శివయ్య వదిన కూతురు మౌనిక (35), హిమబిందు (4), స్వీటి (2), శాంతయ్య (సింగరేణి కార్మికుడు, మృతుడి బంధువు) మృతి చెందినట్టు సమాచారం. 

సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్​ ఇంజిన్లు మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదం షాట్ సర్క్యూట్ వల్ల కాలేదని విద్యుత్ శాఖ అధికారులు తేల్చి చెప్పారు. ఆ ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ కూడా పేలలేదని అధికారులు స్పష్టం చేశారు.  విషయం తెలుసుకున్న మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్, ఏసీపీ తిరుపతి రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.