ఇంటి అద్దె అడిగాడని కత్తితో పొడిచాడు

ఇంటి అద్దె అడిగాడని కత్తితో పొడిచాడు

హైదరాబాద్ : నగరంలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఇంటి అద్దె అడిగిన యజమానిని ఓ యువకుడు దారుణంగా కత్తితో పొడిచాడు. గురువారం అర్థరాత్రి స్థానిక హసన్ నగర్ లో ఈ ఘటన జరిగింది. ఇంటి అద్దె అడిగిన క్రమంలో వారిద్దరి మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో కోపోద్రిక్తుడైన యువకుడు(తజాముల్)  యజమాని కడుపులో రెండు పోట్లు పొడిచాడు. తీవ్ర గాయాలపాలైన ఆ యజమానిని అతని కుటుంబ సభ్యులు, స్థానికులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అతనిపరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.