
అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాదం.. ప్రపంచాన్ని దిగ్ర్భాంతికి గురి చేసిన ఘటన. ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్ది సమయంలోనే క్రాష్ అయ్యి 297 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఓ పది బాంబులు ఒకేసారి పేల్చితే వచ్చిన శబ్దం, మంట, పొగ ఈ ప్రమాదంలో వచ్చింది. ఇంతటి భయంకర ప్రమాదంలో ఫ్లైట్ లో ఉన్న అందరూ మృతి చెందగా ఒకే ఒక్కడు మాత్రం బతికాడు.
అందరి శరీరాలు ముద్ద ముద్దగా మారి గుర్తుపట్టరాని స్థితిలో ఉంటే.. ఇతడు మాత్రం ఎలా బతికాడా.. అని ప్రపంచమంతా ఆశ్చర్యానికి గురైంది. ఇప్పటికీ సోషల్ మీడియాలో, న్యూస్ పోర్టళ్లలో ఎలా బతికాడా అనే సర్చ్ చేస్తున్నారు. ఈ మృత్యుంజయుడు ఇంతటి ప్రమాదం నుంచి ఎలా బతికి బట్టకట్టాడో తెలుసుకోవాల్సిందే.
రమేష్ విశ్వకుమార్ బుచర్వాడా.. ఇంగ్లండ్ నివాసి అయిన ఇతడినే మృత్యుంజయుడు అంటున్నారు. ఎయర్ ఇండియా ఫ్లైట్ AI--171 క్రాష్ లో బతికిన ఏకైక వ్యక్తి. మొత్తం 297 మంది మాంసపు ముద్దలుగా మారిన ఈ విషాద ఘటన నుంచి తప్పించుకుని బయటపడ్డ అదృష్టవంతుడు. అంతటి భయంకర ఘటన జరిగిన తర్వాత ధైర్యంగా నడిచొస్తుంటే.. హాలీవుడ్ సినిమాల్లో మంటల్లో నుంచి వస్తున్న హీరోలా కనిపించాడు.
‘‘విమానం పేలిపోయింది’’.. రమేష్ ను అందరూ చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే గుజరాతీలో చెప్పిన మాట అది. మిగతా ప్యాసెంజర్లు ఏమయ్యారు అని ప్రశ్నిస్తే.. ‘‘అందరూ లోపలే ఉన్నారు’’ అంటూ సమాధానం చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసింది. వెంటనే అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స ప్రారంభించారు అధికారులు.
ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర సీటు ఉంది సరే.. కానీ ఎలా బతికాడు..?
ఎమర్జె్న్సీ ఎగ్జిట్ దగ్గర సీట్ 11A దగ్గర రమేష్ కూర్చుకున్నాడని గుజరాత్ పోలీస్ కమిషనర్ జీఎస్ మాలిక్ చెప్పారు. కానీ అంత పేలుడు సంభవించినప్పుడు ఎమర్జెన్సీ దగ్గర కూర్చున్నా కూడా ఎలా బతికాడు అనేదే అందరి ప్రశ్న.
ఎరోప్లేన్ సీటింగ్ ప్లాన్ చేసే ఎయిరోలోపా (Aerolopa) ప్రకారం.. సీట్ 11A అనేది ఎకానమీ క్లాస్ క్యాబిన్ లో మొదటి వరుసలో ఉంటుంది. Air India Boing 787-8 డ్రీమ్ లైనర్స్ విమానంలో ఇది ఫస్ట్ రో లోనే ఈ సీటు ఉంటుంది. ప్లేన్ రెక్కలకు ముందు రెండు వరుసల దూరంలో , ఎకానమీ క్లాస్ లో మొదటి వరుసలో ఈ సీట్ ఉంటుంది. డోర్ కు కుడివైపు ఉండే ఈ సీటు.. ఎమర్జెన్సీ సమయంలో తప్పించుకోవడానికి ఉపయోగపడుతుంది. పైన ఫోటోలో చూపినట్లుగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ కు అవకాశం ఉండేలా సీట్ ను ఏర్పాటు చేస్తారు.
ప్లేన్ టేకాఫ్ అయ్యాక 30 సెకండ్స్ లోనే ఎమర్జెన్సీ కాల్.. మేడే కాల్ అనౌన్స్ చేశారని రమేశ్ తెలిపాడు. ప్రమాదం జరిగిన సమయంలో స్పృహలోనే ఉన్నానని చెప్పాడు. తీవ్ర గాయాలైనట్లు తనకు ఆ క్షణంలో అర్థమయ్యిందని.. కానీబయటకు దూకి పరుగెత్తగలిగానని తను ఎలా బయటపడ్డ విషయం గురించి తెలిపాడు. అయితే తను ఎలా తప్పించుకున్నానో చెప్పలేనని ఈ సందర్భంగా చెప్పాడు.
ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర ఉన్నప్పటికీ డోర్ పగలగొట్టి బయటకు వచ్చే ప్రయత్నమేమీ రమేష్ చేయలేదు. రెక్కలకు రెండు వరుసల ముందు ఉండటం, ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర ఉండటం అతనికి కలిసొచ్చిందని అధికారులు అంటున్నారు.
It's A miracle... One man survived from Air India Crash. Passenger Vishwash Kumar Ramesh from Seat 11A escaped from the Crash.
— Indian Ranger 🇮🇳 (@India_Ranger) June 12, 2025
He said, there was a loud boom just 30 seconds after takeoff. The plane divided into two. Not sure how, he safely walked out.#Seat11A #planecrash… pic.twitter.com/XChZDF1NqL
ప్రమాదం ఎలా జరిగింది:
గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్లోని సర్ధార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలోని మేఘాని ప్రాంతంలో చెట్టును ఢీకొని ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, 10 సిబ్బంది మొత్తం 242 మందితో గురువారం (జూన్ 12) మధ్యాహ్నం ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరింది.
ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిన ఐదు నిమిషాల్లోనే విమానాశ్రయం సమీపంలోని చెట్టును ఢీకొని జనవాసాల్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న మొత్తం అంటే 241 మంది చనిపోయారు. పైలెట్లు, విమాన సిబ్బంది, ప్రయాణికులు అంతా సజీవ దహనమయ్యారు. అయితే మెడికల్ కాజేసీ హాస్టల్ పై పడటంతో మరింత మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో ప్యాపెసంజర్లతో పాటు కలిపి మొత్తం 297 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు.