సందడిగా హౌడీ మోడీ కార్యక్రమం

సందడిగా హౌడీ మోడీ కార్యక్రమం

హౌడీ మోడీ కార్యక్రమంతో హ్యూస్టన్ సందడిగా మారింది. NRG స్టేడియం బ్యాండ్ బాజాలతో మారుమోగుతోంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో  ప్రజలు స్టేడియానికి చేరుకున్నారు. మోడీ, ట్రంప్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. హౌడీ మోడీ.. వేదికపై ఇద్దరు నేతలు ఏం మాట్లాడబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. భారత సాంప్రదాయ దుస్తుల్లో కార్యక్రమానికి వచ్చారు. భారతీయతను చాటుతున్నారు. మోడీని చూసేందుకు తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని చెబుతున్నారు ప్రజలు. దేశంతో పాటు ప్రపంచానికి.. మోడీ ఆదర్శప్రాయుడంటున్నారు.

ఈ కార్యక్రమానికి 50 వేల మందికి పైగా ఇండియన్స్ హాజరవుతున్నారు. షేర్డ్ డ్రీమ్స్, బ్రైట్ ఫ్యూచర్స్ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అమెరికా నిర్మాణంలో భారతీయుల పాత్ర ఈ వేదిక ప్రతిబింబించనుందని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. భారత్-అమెరికా ప్రజల మధ్య సంబంధాలు పెంపొందించేందుకు ఇది ఒక మంచి అవకాశంగా చెబుతున్నారు.