
శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు, ఇవాళ ఆదివారం కూడా కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయమంతా భక్తులతో సందడి నెలకొంది. తెల్లవారుజామున నుంచే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనం కోసం కంపార్టుమెంట్లలో బారులు తీరారు భక్తులు. దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది.
మరో వైపు భక్తులు శ్రీస్వామి అమ్మవారి రుద్రాభిషేకం, కుంకుమార్చన అభిషేకార్చనలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటున్నారు. అయితే భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ ఈవో పెద్దిరాజు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లు.. కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు అల్పాహారం, పాలు, బిస్కెట్స్ మంచినీళ్లు అందిస్తున్నామని ఆలయ ఈవో పెద్దిరాజు వెల్లడించారు.