
ఖైరతాబాద్ పెద్ద గణేశ్ దర్శనానికి ఆదివారం భక్తులు కిలోమీటర్ల మేర క్యూ కట్టారు. ఈసారి ఒకే సండే రావడంతో ఒక్కసారిగా పోటెత్తడంతో క్యూలైన్లు నిండిపోయాయి. దీంతో పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. భక్తులు వాహనాలను రోడ్లపై ఎక్కడపడితే అక్కడే పార్క్ చేసి వెళ్లడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ ప్రాంతాలు ట్రాఫిక్ లో చిక్కుకున్నాయి. ఈ ప్రాంతానికి వచ్చే సిటీ బస్సులు, మెట్రో రైళ్లు జనంతో కిటకిటలాడాయి.
ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసి పోవడంతో దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించి భక్తుల సెల్ ఫోన్లను కొట్టేశారు. సరైన ఏర్పాట్లు చేయకపోవడం తో ఇబ్బందులు పడాల్సి వచ్చిందని భక్తులు అసహనం వ్యక్తం చేశారు. సిటీలో పలు ప్రాంతాల్లో విగ్రహాలను డీజే, బ్యాండు మేళాల చప్పుళ్లతో నిమజ్జనాలకు తరలిస్తున్నారు. ట్యాంక్ బండ్ వద్దకు విగ్రహాలను నిమజ్జనానికి తీసుకొస్తుండగా.. రాత్రిపూట కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది.