కర్ణాటకలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ భర్త తన భార్యను గత 12 ఏళ్లుగా ఇంట్లోనే నిర్భందించాడు. పోలీసుల సహాయంతో ఆమె బయటపడింది. తన భర్త గత కొన్నేళ్లుగా చిత్ర హింసలకు గురి చేశాడని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటన కర్ణాటకలోని మైసూరులో చోటుచేసుకుంది. అయితే ఆమె అతనిపై కేసు పెట్టడానికి నిరాకరించింది. బాధిత మహిళ అతడికి మూడో భార్య కాగా అభద్రత భావంతోనే అతను ఇలా చేసినట్లు పోలీసులు తెలిపారు.
ముప్పై ఏళ్ల వయస్సులో ఉన్న మహిళ .. తన తల్లిదండ్రుల ఇంట్లో ఉండాలని నిర్ణయించుకుంది. గడిచిన ఈ 12 ఏళ్లు.. . మరుగుదొడ్డి, లూ బ్రేక్ల కోసం ఇంట్లో చిన్న బాక్స్ను ఉపయోగించానని చెప్పింది. పిల్లలు పాఠశాల నుంచి వచ్చినా భర్త ఇంటికి వచ్చేవరకు లోపలికి అనుమతి ఉండదని తెలిపింది. కిటికీ నుంచే పిల్లలకు భోజనం అందిస్తానని కన్నీరు పెట్టుకుంది.
తన తల్లిదండ్రుల ఇంటికి ఎప్పుడు వెళ్లానో కూడా సరిగా గుర్తులేదని వాపోయింది. ఈ సంఘటనలపై భర్తపై కేసు పెట్టేందుకు మాత్రం ఆమె నిరాకరించింది. తన తల్లిదండ్రుల ఇంటి వద్దనే ఉంటూ వివాహ సమస్యలను పరిష్కరించుకుంటానని తెలిపింది. గత మూడు వారాలుగా ఆమె ఇంట్లోనే ఉండటం గమనించామని.. ఆమె కదలికలపై పూర్తి నిఘూ ఉంచామని వెల్లడించారు.