భార్యను బైక్‌పై ఎక్కించుకొని హాస్పిటళ్ల చుట్టూ తిరిగిన భర్త

భార్యను బైక్‌పై ఎక్కించుకొని హాస్పిటళ్ల చుట్టూ తిరిగిన భర్త
  • నా భార్య చనిపోయేలా ఉంది.. అడ్మిట్​ చేస్కోండి ప్లీజ్​ 
  • బైక్​పై ఎక్కించుకొని 3 ఆస్పత్రులు తిప్పినా ఫలితం లేక  ఓ భర్త వేడుకోలు

న్యూఢిల్లీ: నా భార్య చనిపోతోంది. ఆస్పత్రిలో చేర్చుకోండి, మీ కాళ్లు మొక్కుతా' అంటూ ఓ భర్త ఆస్పత్రి సిబ్బందిని వేడుకున్నాడు. గురువారం ఢిల్లీలోని లోక్ నాయక్ జయప్రకాశ్ హాస్పిటల్ దగ్గర కనిపించింది ఈ దృశ్యం. 30 ఏండ్ల రూబీ ఖాన్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. కండిషన్ సీరియస్ కావడంతో భర్త అస్లాం ఖాన్ ఆమెను బైక్​పై ఆస్పత్రికి తీసుకెళ్లాడు. మూడు హాస్పిటళ్లు తిరిగినా ఎక్కడా అడ్మిట్ చేసుకోలేదు. చివరకు లోక్‌నాయక్ హాస్పిటల్‌కే చేరుకున్నారు. బెడ్లు ఖాళీగా లేవని సిబ్బంది చెప్పడంతో ఆస్పత్రి సిబ్బందిని అస్లామ్ వేడుకున్నాడు. అయినా ఫలితం దక్కలే. కాళ్లు మొక్కుతానన్నా.. ఆస్పత్రిలో చేర్చుకోలేదని, బెడ్లు ఖాళీగా లేవని చెబుతున్నారని, తన భార్య చనిపోతుంటే చూస్తూ ఎలా ఉండాలని అస్లామ్ ఖాన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. గురువారం ఢిల్లీలోని లోక్‌ నాయక్ హాస్పిటల్ వద్ద అంబులెన్స్​లు, ప్రైవేట్ వెహికల్స్​తో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆస్పత్రిలో చేరేందుకు కరోనా పేషెంట్లు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.