తెలంగాణను అప్పులపాలు చేసిన్రు: హుస్సేన్​ నాయక్​

తెలంగాణను అప్పులపాలు చేసిన్రు:  హుస్సేన్​ నాయక్​

మహబూబాబాద్​ అర్బన్​, వెలుగు:  తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్​ ఉందని, బీఆర్​ఎస్​ ప్రభుత్వం రూ.6లక్షల కోట్ల అప్పుల పాలు చేసిందని గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాటోత్​ హుస్సేన్​నాయక్​ ఆరోపించారు. మంగళవారం పల్లె పల్లె బీజేపీ..  ఇంటింటికి హుస్సేన్​ నాయక్​’ ప్రజా ఆశీర్వాదయాత్రలో ఆయన పాల్గొన్నారు.

Also Read :- సమస్యలు పట్టని ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి

మున్సిపాలిటీలోని  సాంక్రియతండా, మంగలికాలనీ, వినాయకకాలనీ, పత్తిపాక, బాబునాయక్​తండా డాక్టర్స్​స్ట్రీట్​, మార్వడీబజార్​, రెడ్డిబజార్​లలో ప్రధాని మోదీ చేసిన అభివృద్ధిపై ప్రజలకు వివరించారు. బీజేపీ లీడర్ల శశివర్ధన్​రెడ్డి, సిద్ధార్ధ్​రెడ్డి, శ్యాంసుందర్​శర్మ తదితరులు ఉన్నారు.