తొలిరౌండులో బీజేపీ ఆధిక్యం

తొలిరౌండులో బీజేపీ ఆధిక్యం

హుజురాబాద్ ఉపఎన్నికలో బీజేపీ ఆధిక్యంలోకి వచ్చింది. హుజురాబాద్ మండలానికి చెందిన ఈవీఎంల లెక్కింపులో ఈటలకు 4610 ఓట్లు రాగా.. గెల్లు శ్రీనివాస్ కు 4444 ఓట్లు, కాంగ్రెస్ కు 119 ఓట్లు వచ్చాయి. బీజేపీ తొలిరౌండులో 166 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకుంది. ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ ఉద‌యం 8 గంట‌ల ప్రారంభ‌మైంది. ఫస్ట్ 753 పోస్ట‌ల్ బ్యాలెట్ల ఓట్ల‌ను లెక్కిస్తున్నారు. తర్వాత ఈవీఎంల్లోని ఓట్ల‌ను లెక్కించ‌నున్నారు. మొత్తం 22 రౌండ్ల‌లో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ముగియ‌నుంది. ఒక్కో రౌండ్‌కు 30 నిమిషాల స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది.