హైద‌రాబాద్ - పాండిచ్చేరి ట్రావెల్స్ బ‌స్సు కాలి బూడిదైంది

హైద‌రాబాద్ - పాండిచ్చేరి ట్రావెల్స్ బ‌స్సు కాలి బూడిదైంది

ట్రావెల్స్​ బస్సులో షార్ట్​ సర్క్యూట్​ అయి మంటలు చెలరేగిన ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లాలో జూన్​ 22 న అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్​నుంచి పాండిచ్చేరి వెళ్తున్న మోజో ప్రైవేట్​ బస్సు 25 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా సింగరాయకొండకు రాగానే హైటెన్షన్​ వైర్లు బస్సుకు తగలడంతో షార్ట్ సర్క్యూట్​జరిగింది.

డ్రైవర్​ అప్రమత్తం అయి ప్రయాణికులను బస్సులోంచి దింపేశాడు. అనంతరం  మంటలు బస్సు మొత్తం వ్యాపించడంతో బస్సుతో పాటు ప్రయాణికుల లగేజీ మొత్తం దగ్ధం అయింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.