స్కూటీ ఢీకొని.. మేనమామ చేతిలోంచి జారి చిన్నారి మృతి

స్కూటీ ఢీకొని.. మేనమామ చేతిలోంచి జారి చిన్నారి మృతి

హైదరాబాద్‌లో స్కూటీ ఢీకొని 14 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. సిటీలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఈ దారుణం జరిగింది.

జయభేరి సిలికాన్ టవర్స్ వద్ద రాజ్ కుమార్ అనే నిర్మాణ కూలీ మేనల్లుడు సతీశ్‌ని ఎత్తుకుని రోడ్డు దాడుతుండగా ఓ స్కూటీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో అతడి చేతుల్లోంచి జారి ఆ చిన్నారి రోడ్డుపై పడిపోయాడు. ఆ పసివాడికి తీవ్రమైన గాయాలు కావడంతో మరణించాడు. రాజ్ కుమార్‌కు కూడా గాయాలు కావడంతో అతడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. స్కూటీతో ఢీకొట్టిన వ్యక్తిని అరెస్టు చేశారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ప్రమాదానికి అతి వేగం కారణమైనప్పటికీ.. సిటీ ట్రాఫిక్‌లో పిల్లలతో రోడ్డు దాటేటప్పుడు జాగ్రతగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒంటరిగా పెద్దలు వెళ్లేటప్పుడే ఎంతో భద్రంగా చూసుకుని వెళ్తుంటాం. కానీ అలాంటిది పసిపిల్లలను ఎత్తుకుని ఉన్నప్పుడు ఒక నిమిషం ఆలస్యమైనా వాహనాలేవీ లేనప్పుడే రోడ్డు దాటడం మేలు.

More News:

భర్త వేధిస్తున్నాడని పోలీసులను ఆశ్రయించిన భార్య : వారిపై సీపీకి భర్త ఫిర్యాదు 

పట్టాలు తప్పిన టవర్ కార్ ఇంజిన్.. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం