హైదరాబాద్, వెలుగు: డోర్ల తయారీ కోసం జైపూర్లో రూ.175 కోట్ల పెట్టుబడితో నిర్మించిన ఫ్యాక్టరీని ప్రారంభించినట్లు హైదరాబాద్కు చెందిన శక్తి హోర్మాన్ ప్రకటించింది. చెక్క తలుపుల తయారీకి కేటాయించిన లైన్తో మొదటి దశ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. రెండవ దశ అక్టోబర్లో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ఈ ప్లాంట్లో 150 మంది ప్రత్యక్ష, 300 మంది పరోక్ష సిబ్బందిని నియమించారు.
రెండోదశలో అల్యూమినియం, మెటల్ తలుపుల కోసం ప్రొడక్షన్ లైన్లను ఏర్పాటు చేస్తారు. శక్తి హోర్మాన్ ఎండీ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టు వార్షిక సామర్థ్యం 1.50 లక్షల యూనిట్లని తెలిపారు. హైదరాబాద్లోని గాగిల్లాపూర్లోని తమ ప్లాంట్ ఏటా రెండు లక్షల కస్టమ్-మేడ్ డోర్లు, డోర్ ఫ్రేమ్లు తయారు చేస్తుందని అన్నారు.