జైపూర్​లో శక్తి హోర్మాన్ ఫ్యాక్టరీ

జైపూర్​లో శక్తి హోర్మాన్ ఫ్యాక్టరీ

హైదరాబాద్​, వెలుగు: డోర్ల తయారీ కోసం  జైపూర్‌‌‌‌లో రూ.175 కోట్ల పెట్టుబడితో నిర్మించిన ఫ్యాక్టరీని ప్రారంభించినట్లు హైదరాబాద్​కు చెందిన శక్తి హోర్మాన్​ ప్రకటించింది. చెక్క తలుపుల తయారీకి కేటాయించిన లైన్‌‌‌‌తో మొదటి దశ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. రెండవ దశ అక్టోబర్​లో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ఈ ప్లాంట్‌‌‌‌లో 150 మంది ప్రత్యక్ష,  300 మంది పరోక్ష సిబ్బందిని నియమించారు.  

రెండోదశలో అల్యూమినియం, మెటల్ తలుపుల కోసం ప్రొడక్షన్​ లైన్లను ఏర్పాటు చేస్తారు.  శక్తి హోర్మాన్ ఎండీ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ గ్రీన్​ఫీల్డ్ ​ప్రాజెక్టు వార్షిక సామర్థ్యం 1.50 లక్షల యూనిట్లని తెలిపారు.   హైదరాబాద్‌‌‌‌లోని గాగిల్లాపూర్‌‌‌‌లోని తమ ప్లాంట్ ఏటా రెండు లక్షల కస్టమ్-మేడ్ డోర్లు, డోర్ ఫ్రేమ్‌‌‌‌లు తయారు చేస్తుందని అన్నారు.